కోడెలపై దాడిని నిరసిస్తూ టీడీపీ శ్రేణుల రాస్తారోకో

  • సత్తెనపల్లిలోని రామకృష్ణాపురం కూడలిలో రాస్తారోకో
  • కోడెలపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలి
  • రాస్తారోకోతో స్తంభించిన ట్రాఫిక్
టీడీపీ నేత కోడెల శివప్రసాద్ పై వైసీపీ కార్యకర్తల దాడిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. సత్తెనపల్లి మండలంలోని రామకృష్ణాపురం కూడలిలో రాస్తారోకో నిర్వహించాయి. కోడెలపై దాడికి పాల్పడిన నిందితులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ శ్రేణుల రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. గుంటూరు, అమరావతి, సత్తెనపల్లి వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Go Back to Shorts
Guntur District
sattenpalli
speaker
kodela
Telugudesam

More Telugu News